Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:36 AM

మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేత

మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేత

మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేత
December 16, 2025 07:54 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంగ్రెస్‌లోకి స్వతంత్ర ప్రజాప్రతినిధులు

మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్‌కు బలపడిన పంచాయతీ

సుదినం (మాక్లూర్), స్థానికం ప్రతినిధి

మాక్లూర్ మండలం మెట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన బలం చేకూరింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్‌గా ఎన్నికైన గాజుల నవీన్ కాళీ, ఉప సర్పంచ్ బత్తుల వినయ్ సాగర్‌తో పాటు పలువురు వార్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని నూతనంగా చేరిన ప్రజాప్రతినిధులు తెలిపారు.అలాగే వార్డ్ సభ్యులుగా ఎన్నికైన విజయ శాంతి, సత్య కల్యాణి, బూర్గుల యాకుబ్, వెంకటేశ్వర్లు, బుంగ అబ్రహం లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో మెట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడినట్టయ్యింది.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాయకులు నగేష్, విఠల్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News