మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేత
మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేత
స్థానికం బృందం
కాంగ్రెస్లోకి స్వతంత్ర ప్రజాప్రతినిధులు
మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్కు బలపడిన పంచాయతీ
సుదినం (మాక్లూర్), స్థానికం ప్రతినిధి
మాక్లూర్ మండలం మెట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన బలం చేకూరింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా ఎన్నికైన గాజుల నవీన్ కాళీ, ఉప సర్పంచ్ బత్తుల వినయ్ సాగర్తో పాటు పలువురు వార్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని నూతనంగా చేరిన ప్రజాప్రతినిధులు తెలిపారు.అలాగే వార్డ్ సభ్యులుగా ఎన్నికైన విజయ శాంతి, సత్య కల్యాణి, బూర్గుల యాకుబ్, వెంకటేశ్వర్లు, బుంగ అబ్రహం లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో మెట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడినట్టయ్యింది.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాయకులు నగేష్, విఠల్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి