Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:23 PM

లోన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్

లోన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్

లోన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్
15-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పోలేపాక వంశీ, ఘట్‌కేసర్‌కు చెందిన వేణుమాధవ్ కటకం అనే ఇద్దరు యువకులు వెంకటరెడ్డి అనే వ్యక్తిని నమ్మి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు ఎనిమిది నెలలుగా పరిచయం పెంచుకున్న వెంకటరెడ్డి, స్నేహం పేరుతో వారి ఆధార్, పాన్, ఐటి రిటర్న్స్ వంటి పత్రాలు తీసుకుని వారి పేర్లపై లోన్లు ఇప్పించి వచ్చిన డబ్బులను ప్రామిసరీ నోట్ల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాధితులను బ్లాక్ చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ టీం సభ్యులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం వెంకటరెడ్డి తండ్రి శ్రీకాంత్ రెడ్డితో చర్చించి బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరగా, వారు కొంత గడువు కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ ప్రజలు లోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ అతి విశ్వాసంతో నమ్మి వ్యక్తిగత పత్రాలు ఇవ్వవద్దని సూచించారు. నిరుపేద కుటుంబాలకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బద్దె వీరభద్రం, మిట్టపల్లి రాజకుమార్, వేణు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లోన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్

Article Image

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పోలేపాక వంశీ, ఘట్‌కేసర్‌కు చెందిన వేణుమాధవ్ కటకం అనే ఇద్దరు యువకులు వెంకటరెడ్డి అనే వ్యక్తిని నమ్మి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు ఎనిమిది నెలలుగా పరిచయం పెంచుకున్న వెంకటరెడ్డి, స్నేహం పేరుతో వారి ఆధార్, పాన్, ఐటి రిటర్న్స్ వంటి పత్రాలు తీసుకుని వారి పేర్లపై లోన్లు ఇప్పించి వచ్చిన డబ్బులను ప్రామిసరీ నోట్ల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాధితులను బ్లాక్ చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ టీం సభ్యులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం వెంకటరెడ్డి తండ్రి శ్రీకాంత్ రెడ్డితో చర్చించి బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరగా, వారు కొంత గడువు కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ ప్రజలు లోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ అతి విశ్వాసంతో నమ్మి వ్యక్తిగత పత్రాలు ఇవ్వవద్దని సూచించారు. నిరుపేద కుటుంబాలకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బద్దె వీరభద్రం, మిట్టపల్లి రాజకుమార్, వేణు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News