Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వ్యవసాయ కార్మిక సంఘం సభను జయప్రదం చేయాలి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 06:29 PM

లోన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్

లోన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్

లోన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్
May 15, 2026 04:29 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పోలేపాక వంశీ, ఘట్‌కేసర్‌కు చెందిన వేణుమాధవ్ కటకం అనే ఇద్దరు యువకులు వెంకటరెడ్డి అనే వ్యక్తిని నమ్మి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు ఎనిమిది నెలలుగా పరిచయం పెంచుకున్న వెంకటరెడ్డి, స్నేహం పేరుతో వారి ఆధార్, పాన్, ఐటి రిటర్న్స్ వంటి పత్రాలు తీసుకుని వారి పేర్లపై లోన్లు ఇప్పించి వచ్చిన డబ్బులను ప్రామిసరీ నోట్ల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాధితులను బ్లాక్ చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ టీం సభ్యులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం వెంకటరెడ్డి తండ్రి శ్రీకాంత్ రెడ్డితో చర్చించి బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరగా, వారు కొంత గడువు కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ ప్రజలు లోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ అతి విశ్వాసంతో నమ్మి వ్యక్తిగత పత్రాలు ఇవ్వవద్దని సూచించారు. నిరుపేద కుటుంబాలకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బద్దె వీరభద్రం, మిట్టపల్లి రాజకుమార్, వేణు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News