లోక్యతండా పాఠశాలకు వాటర్ కూలర్ బహూకరణ
లోక్యతండా పాఠశాలకు వాటర్ కూలర్ బహూకరణ
Biksham Goud
వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని లోక్యతండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చల్లని తాగునీరు అందించేందుకు దాత తాటి శ్రీనివాస్ ముందుకు వచ్చారు. ఖమ్మం నగరం వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన ఆయన శనివారం నిర్వహించిన పేరెంట్-టీచర్స్ సమావేశంలో వాటర్ కూలర్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాదె వెంకన్నకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి మరిన్ని దాతలు ముందుకు రావాలని కోరారు.
సర్పంచ్ వడ్యా వెంకటేశ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
దాత తాటి శ్రీనివాస్ను సర్పంచ్ వడ్యా వెంకటేశ్, ఉపసర్పంచ్ నీలమ్మ, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుభద్ర, రవిరత్నం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి