PRINT TIME: March 28, 2026 09:14 PM
లోక్ అదాలత్లో భారీగా కేసుల పరిష్కారం – 545 కేసులు రాజీతో ముగింపు
లోక్ అదాలత్లో భారీగా కేసుల పరిష్కారం – 545 కేసులు రాజీతో ముగింపు
March 28, 2026 07:16 PM
31 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ మొత్తం 545 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు కోర్టు జడ్జి మంథని శ్రీధర్ తెలిపారు. ప్రజలు తమ వివాదాలను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కోర్టులపై భారాన్ని తగ్గించడం, పరస్పర అంగీకారంతో సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. కక్షిదారులు రాజీమార్గాన్ని ఎంచుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సిఐలు, ఎస్సైలు, సంబంధిత అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి