Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.54.75 కోట్ల బడ్జెట్ ఆమోదం అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 09:52 PM

లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు

లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు

లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు
March 28, 2026 08:12 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి లో జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను త్వరితగతిన, సులభంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్రతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్, కుటుంబ, ఆస్తి, వైవాహిక, బ్యాంకు సంబంధిత వివాదాలు తదితర కేసులను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో తక్కువ సమయంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, సమయం మరియు ఖర్చు ఆదా అవుతాయని చెప్పారు. చిన్న వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా కోర్టులపై భారం తగ్గడమే కాకుండా సమాజంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News