Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు

లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు

లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు
March 28, 2026 08:12 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి లో జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను త్వరితగతిన, సులభంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్రతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్, కుటుంబ, ఆస్తి, వైవాహిక, బ్యాంకు సంబంధిత వివాదాలు తదితర కేసులను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో తక్కువ సమయంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, సమయం మరియు ఖర్చు ఆదా అవుతాయని చెప్పారు. చిన్న వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా కోర్టులపై భారం తగ్గడమే కాకుండా సమాజంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News