లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు
లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు
Krishna
సంగారెడ్డి లో జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను త్వరితగతిన, సులభంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్రతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్, కుటుంబ, ఆస్తి, వైవాహిక, బ్యాంకు సంబంధిత వివాదాలు తదితర కేసులను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో తక్కువ సమయంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, సమయం మరియు ఖర్చు ఆదా అవుతాయని చెప్పారు. చిన్న వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా కోర్టులపై భారం తగ్గడమే కాకుండా సమాజంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి