హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐలు బాబునాయక్, ప్రమోద్ ఒక నిందితుడికి 41 నోటీసులు ఇవ్వడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉచ్చుపన్ని లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్ఐలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి