PRINT TIME: May 26, 2026 04:35 PM
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
March 14, 2026 07:17 AM
27 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రంగన్న శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. గ్రామానికి చెందిన లబ్ధిదారురాలి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు చేయాలంటే రూ.20,000 లంచం ఇవ్వాలని రంగన్న డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు శుక్రవారం రూ.15,000 ఇవ్వడానికి ప్రయత్నించగా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచ్చులో రంగన్న లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఇంటి నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల వ్యవహారంలో చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి