Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:40 PM

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన లైన్‌మన్

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన లైన్‌మన్

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన లైన్‌మన్
February 19, 2026 12:44 AM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లైన్‌మన్ నక్కబోయిన నాగేంద్రబాబును పట్టుకున్నారు. చేజర్లకు చెందిన గుండాల యోహాన్ తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా, ఇందుకు నాగేంద్రబాబు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న అతడు తన తండ్రి ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

డబ్బుల డిమాండ్‌తో విసిగిపోయిన రైతు విజయవాడలోని ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అధికారులు పక్కా ప్రణాళికతో కాపుకాసి లంచం స్వీకరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తె ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఎస్ఐలు దాడుల్లో పాల్గొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News