Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:32 PM

లంచం తీసుకుంటూ ఏఎల్‌ఎం పట్టివేత

లంచం తీసుకుంటూ ఏఎల్‌ఎం పట్టివేత

లంచం తీసుకుంటూ ఏఎల్‌ఎం పట్టివేత
May 17, 2026 05:18 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ట్రాన్స్‌ఫార్మర్ బిగించేందుకు రైతు వద్ద రూ.35 వేల లంచం డిమాండ్ చేసిన మోటకొండూరు మండలం మెడికుంటపల్లి గ్రామ అసిస్టెంట్ లైన్‌మన్ రమేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రైతు అనంతరెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఇప్పటికే రూ.30 వేల డీడీలు చెల్లించినప్పటికీ నెలలుగా పని పూర్తి కాలేదని సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్ బిగించాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ రమేష్ ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.

పని పూర్తయిన తర్వాత రూ.10 వేలు ఇస్తానని రైతు చెప్పినా రూ.35 వేలే ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన అనంతరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన ఏసీబీ అధికారులు రైతు ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా రమేష్‌ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News