PRINT TIME: May 26, 2026 04:32 PM
లంచం తీసుకుంటూ ఏఎల్ఎం పట్టివేత
లంచం తీసుకుంటూ ఏఎల్ఎం పట్టివేత
May 17, 2026 05:18 PM
41 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి: ట్రాన్స్ఫార్మర్ బిగించేందుకు రైతు వద్ద రూ.35 వేల లంచం డిమాండ్ చేసిన మోటకొండూరు మండలం మెడికుంటపల్లి గ్రామ అసిస్టెంట్ లైన్మన్ రమేష్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రైతు అనంతరెడ్డి ట్రాన్స్ఫార్మర్ కోసం ఇప్పటికే రూ.30 వేల డీడీలు చెల్లించినప్పటికీ నెలలుగా పని పూర్తి కాలేదని సమాచారం. ట్రాన్స్ఫార్మర్ బిగించాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ రమేష్ ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
పని పూర్తయిన తర్వాత రూ.10 వేలు ఇస్తానని రైతు చెప్పినా రూ.35 వేలే ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన అనంతరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన ఏసీబీ అధికారులు రైతు ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా రమేష్ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి