Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:53 AM

లంచం తీసుకుంటూ ఏఎల్‌ఎం పట్టివేత

లంచం తీసుకుంటూ ఏఎల్‌ఎం పట్టివేత

లంచం తీసుకుంటూ ఏఎల్‌ఎం పట్టివేత
17-05-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ట్రాన్స్‌ఫార్మర్ బిగించేందుకు రైతు వద్ద రూ.35 వేల లంచం డిమాండ్ చేసిన మోటకొండూరు మండలం మెడికుంటపల్లి గ్రామ అసిస్టెంట్ లైన్‌మన్ రమేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రైతు అనంతరెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఇప్పటికే రూ.30 వేల డీడీలు చెల్లించినప్పటికీ నెలలుగా పని పూర్తి కాలేదని సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్ బిగించాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ రమేష్ ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.

పని పూర్తయిన తర్వాత రూ.10 వేలు ఇస్తానని రైతు చెప్పినా రూ.35 వేలే ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన అనంతరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన ఏసీబీ అధికారులు రైతు ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా రమేష్‌ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Sthanikam

లంచం తీసుకుంటూ ఏఎల్‌ఎం పట్టివేత

Article Image

భువనగిరి: ట్రాన్స్‌ఫార్మర్ బిగించేందుకు రైతు వద్ద రూ.35 వేల లంచం డిమాండ్ చేసిన మోటకొండూరు మండలం మెడికుంటపల్లి గ్రామ అసిస్టెంట్ లైన్‌మన్ రమేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రైతు అనంతరెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఇప్పటికే రూ.30 వేల డీడీలు చెల్లించినప్పటికీ నెలలుగా పని పూర్తి కాలేదని సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్ బిగించాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ రమేష్ ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.

పని పూర్తయిన తర్వాత రూ.10 వేలు ఇస్తానని రైతు చెప్పినా రూ.35 వేలే ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన అనంతరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన ఏసీబీ అధికారులు రైతు ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా రమేష్‌ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News