Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల సరఫరా సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:55 PM

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన
April 10, 2026 06:06 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వార్డు ప్రజల ఇబ్బందులు తీరుస్తాం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు (లింగోజిగూడెం)లో దీర్ఘకాలంగా వేధిస్తున్న శ్మశానవాటిక కొరతను తీర్చేందుకు మున్సిపల్ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సంబంధిత స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​గ్రామంలో సరైన శ్మశానవాటిక లేక అంత్యక్రియల సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక కౌన్సిలర్, నాయకులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కూడిన శ్మశానవాటిక ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. స్థల సేకరణ, నిధుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు పర్నే శివారెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్,​మున్సిపల్ ఉపాధ్యక్షులు కళ్లెం దయాకర్ రెడ్డి,​నాయకులు బండమీది వెంకటేష్, కొమ్ము లక్ష్మయ్య,

​గ్రామశాఖ ఉపాధ్యక్షులు ఎర్రగోని నవీన్, మందోరి మహేష్,​ప్రధాన కార్యదర్శి బోసి బాబు, కార్యదర్శి తీగల రాజు, బాతరాజు శివ, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News