Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన
April 10, 2026 06:06 PM 231 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వార్డు ప్రజల ఇబ్బందులు తీరుస్తాం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు (లింగోజిగూడెం)లో దీర్ఘకాలంగా వేధిస్తున్న శ్మశానవాటిక కొరతను తీర్చేందుకు మున్సిపల్ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సంబంధిత స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​గ్రామంలో సరైన శ్మశానవాటిక లేక అంత్యక్రియల సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక కౌన్సిలర్, నాయకులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కూడిన శ్మశానవాటిక ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. స్థల సేకరణ, నిధుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు పర్నే శివారెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్,​మున్సిపల్ ఉపాధ్యక్షులు కళ్లెం దయాకర్ రెడ్డి,​నాయకులు బండమీది వెంకటేష్, కొమ్ము లక్ష్మయ్య,

​గ్రామశాఖ ఉపాధ్యక్షులు ఎర్రగోని నవీన్, మందోరి మహేష్,​ప్రధాన కార్యదర్శి బోసి బాబు, కార్యదర్శి తీగల రాజు, బాతరాజు శివ, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News