Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:11 AM

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన
April 10, 2026 06:06 PM 234 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వార్డు ప్రజల ఇబ్బందులు తీరుస్తాం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు (లింగోజిగూడెం)లో దీర్ఘకాలంగా వేధిస్తున్న శ్మశానవాటిక కొరతను తీర్చేందుకు మున్సిపల్ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సంబంధిత స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​గ్రామంలో సరైన శ్మశానవాటిక లేక అంత్యక్రియల సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక కౌన్సిలర్, నాయకులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కూడిన శ్మశానవాటిక ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. స్థల సేకరణ, నిధుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు పర్నే శివారెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్,​మున్సిపల్ ఉపాధ్యక్షులు కళ్లెం దయాకర్ రెడ్డి,​నాయకులు బండమీది వెంకటేష్, కొమ్ము లక్ష్మయ్య,

​గ్రామశాఖ ఉపాధ్యక్షులు ఎర్రగోని నవీన్, మందోరి మహేష్,​ప్రధాన కార్యదర్శి బోసి బాబు, కార్యదర్శి తీగల రాజు, బాతరాజు శివ, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News