లింగోజిగూడెం 3వ వార్డు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా హరి బాబు
లింగోజిగూడెం 3వ వార్డు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా హరి బాబు
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బోసి హరి బాబు ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన హరి బాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బీఎన్ రెడ్డి, కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, మున్సిపల్ ఉపాధ్యక్షులు కళ్ళెం దయాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పర్న్ శివ రెడ్డి, మందోరి సురేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పేందుకు ముందుంటానని హరి బాబు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి