లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం
లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం
K.RAVI
దివిస్ యాజమాన్యాన్ని అభినందించిన చైర్మన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం 1వ వార్డులో దివిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రజల సౌకర్యార్థం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసిన దివిస్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, దివిస్ ప్రతినిధులు కిషోర్, గోపి, మాజీ కౌన్సిలర్ కొరగోని లింగస్వామి, ఎస్. వెంకట్ రెడ్డి, ఎస్. యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నల్ల పర్వతాలు యాదవ్, ఈశ్వర్ గౌడ్, ఊదరి యాదయ్య, భగవంతు రెడ్డి, గణేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి