లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ
లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో వేసవి కాలంలో తీవ్రమైన ఎండ తాకిడిని దృష్టిలో ఉంచుకుని వీధి వ్యాపారులకు ఉపశమనం కలిగించేలా లైన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాపారులకు గొడుగులను అందజేశారు.జిల్లా జిఎంటి కోఆర్డినేటర్ MJF Ln గుడిపూడి వెంకటేశ్వరరావు సహకారంతో ముఖ్యంగా కూరగాయల వ్యాపారులకు ఈ గొడుగులను పంపిణీ చేయడం జరిగింది. వేసవి కాలంలో రోడ్లపై వ్యాపారం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రేగులగడ్డ నర్సింహా గౌడ్,ట్రెజరర్ కొల్లోజు శ్రీకాంత్, లయన్స్ సభ్యులు మరియు కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, పెందోట రవింద్రచారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి