లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం-ఉగాది పచ్చడి పంపిణీ
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం-ఉగాది పచ్చడి పంపిణీ
K.RAVI
లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ ముందర చలివేంద్రం ఏర్పాటు చేసి, ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ చింతల వెంకటరెడ్డి జ్ఞాపకార్థం, వారి కుమారుడు చింతల ప్రభాకర్ రెడ్డి – శ్వేత దంపతుల సౌజన్యంతో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, సీఐ మన్మధ కుమార్ ప్రారంభించారు. అనంతరం భక్తులకు, ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పర్వదినం సృష్టి ఆరంభానికి ప్రతీకగా భావిస్తారని, ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలోని సుఖదుఃఖాలకు సూచికలని తెలిపారు. జీవితం లో ఎదురయ్యే అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ, కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ పాక చిరంజీవి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పోలోజు శ్రీనివాసచారి, ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్, కార్యదర్శి మోగుదాల రమేష్, కోశాధికారి గోశిక కరుణాకర్, క్లబ్ అధ్యక్షులు తిరందాసు జగన్నాథ్, కార్యదర్శి అతహర్ పాషా, కోశాధికారి సిలివేరు మంగయ్య, సభ్యులు ఉప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, కటకం ప్రశాంత్, చింతల ప్రభాకర్ రెడ్డి, కామిశెట్టి చంద్రశేఖర్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, గోపగోని లక్ష్మణ్, దాచేపల్లి శ్రీనివాస్, వేముల నరసింహ, చింతల తిరుమలరెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణ చారి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి