Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:53 AM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ ల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ ల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ ల పంపిణీ
January 24, 2026 05:37 AM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలలు పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు విద్యాభ్యాసానికి ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్నప్పటికీ, తాగునీటి అవసరాల కోసం విద్యార్థులు ఇంటి నుంచే నీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు వాడేసిన ప్లాస్టిక్ సీసాలు, శీతల పానీయాల సీసాలను ఉపయోగిస్తున్నారు.

ప్లాస్టిక్ సీసాల వినియోగం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ చిన్నారుల శరీరంలోకి ప్రవేశించి జీర్ణకోశ సమస్యలతో పాటు మెదడుపై కూడా ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు రక్తంలో కలసి, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీయవచ్చని వారు పేర్కొంటున్నారు.

ఈ పరిస్థితిని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ, ప్లాస్టిక్ సీసాలకు ప్రత్యామ్నాయంగా స్టీల్ సీసాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దాతలను సంప్రదించారు.

దీనికి స్పందించిన నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త గర్రె వెంకన్న ఝాన్సీ దంపతులు, తమ మనవరాలు ఆధ్య మొదటి పుట్టినరోజు సందర్భంగా పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 60 మంది విద్యార్థులకు పదివేల రూపాయల విలువైన స్టీల్ వాటర్ బాటిల్స్‌ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంటల వెంకటేశ్వర్లు, నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్, వాసవి వనిత క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు బ్రహ్మదేవర పద్మావతి, వృద్ధాశ్రమ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, క్లబ్ సెక్రటరీ సూర్యచంద్రరావు, ఉపాధ్యాయులు డి.ప్రభాకర్, ఎల్.నగేష్, టి.నర్సింహమూర్తి, జి.కల్పన, కె.విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను, లయన్స్ క్లబ్ సభ్యులను పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా అభినందించింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News