Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 01:16 PM

లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె మృతి

లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె మృతి

లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె  మృతి
24-01-2026 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎండి నాసిర్ సన్నాఫ్ ఉస్మాన్ (61) అనే లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో చోటుచేసుకుంది.

సొంత లారీ కంటైనర్‌తో ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎండి నాసిర్, మార్గమధ్యంలో చిట్యాల మండల పరిధిలోని గుండ్రంపల్లి గ్రామ శివారులో ఉన్న జేబి వెంచర్ వద్దకు రాగానే ఛాతిలో నొప్పి వస్తోందని తన కూతురు గులాబ్ షాన్‌కు ఫోన్ ద్వారా తెలిపాడు. అనంతరం లారీని రోడ్డు పక్కకు ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా, స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించగా, అప్పటికే గుండెపోటుతో నాసిర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుని కూతురు గులాబ్ షాన్ ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Sthanikam

లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె మృతి

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎండి నాసిర్ సన్నాఫ్ ఉస్మాన్ (61) అనే లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో చోటుచేసుకుంది.

సొంత లారీ కంటైనర్‌తో ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎండి నాసిర్, మార్గమధ్యంలో చిట్యాల మండల పరిధిలోని గుండ్రంపల్లి గ్రామ శివారులో ఉన్న జేబి వెంచర్ వద్దకు రాగానే ఛాతిలో నొప్పి వస్తోందని తన కూతురు గులాబ్ షాన్‌కు ఫోన్ ద్వారా తెలిపాడు. అనంతరం లారీని రోడ్డు పక్కకు ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా, స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించగా, అప్పటికే గుండెపోటుతో నాసిర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుని కూతురు గులాబ్ షాన్ ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News