లారీ ఢీకొని మేస్త్రి మృతి
లారీ ఢీకొని మేస్త్రి మృతి
K.RAVI
చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మేస్త్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఈసం సత్తయ్య (43), ప్రస్తుతం చౌటుప్పల్ రాంనగర్ కాలనీలో నివాసం ఉంటూ మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తేదీ 09-03-2026న మేస్త్రి పని ముగించుకుని తంగడపల్లి నుండి ఆటోలో చౌటుప్పల్ వైపు వస్తూ తంగడపల్లి ఎక్స్ రోడ్ వద్ద దిగాడు. అక్కడ నుండి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిట్యాల నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ లారీ (TS 07UG 9396) డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సత్తయ్య రోడ్డుపై పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయం, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి అన్నయ్య ఈసం బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి