Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:03 AM

లారీ ఢీకొని మేస్త్రి మృతి

లారీ ఢీకొని మేస్త్రి మృతి

లారీ ఢీకొని మేస్త్రి మృతి
March 10, 2026 12:40 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మేస్త్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఈసం సత్తయ్య (43), ప్రస్తుతం చౌటుప్పల్ రాంనగర్ కాలనీలో నివాసం ఉంటూ మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తేదీ 09-03-2026న మేస్త్రి పని ముగించుకుని తంగడపల్లి నుండి ఆటోలో చౌటుప్పల్ వైపు వస్తూ తంగడపల్లి ఎక్స్ రోడ్ వద్ద దిగాడు. అక్కడ నుండి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిట్యాల నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ లారీ (TS 07UG 9396) డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సత్తయ్య రోడ్డుపై పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయం, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి అన్నయ్య ఈసం బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News