Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

లారీ డ్రైవర్ అతివేగం.. బాలిక నిండు ప్రాణం బలి

లారీ డ్రైవర్ అతివేగం.. బాలిక నిండు ప్రాణం బలి

లారీ డ్రైవర్ అతివేగం.. బాలిక నిండు ప్రాణం బలి
February 15, 2026 02:29 AM 215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లింగోజిగూడెం శివారులో హైవే 9 హోటల్ వద్ద శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త ఓ బాలిక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనతో మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఆరెగూడెం గ్రామానికి చెందిన వడ్డేగోని రమేష్ (33) తన పెద్ద కుమార్తె వడ్డెగోని రిహాన్సిక (9) తో కలిసి బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నారు.మార్గ మధ్యలో లింగోజిగూడెం హైవే 9 హోటల్ సమీపానికి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనతో బాలిక రిహాన్సిక లారీ వెనుక టైర్ల కింద పడిపోయింది. లారీ అదే వేగంతో ముందుకు దూసుకెల్లడంతో చిన్నారి తల ఛిద్రమై అక్కడీకక్కడే మృతి చెందింది. తండ్రి రమేష్ తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రమేష్ ను 108 అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె రిహాన్సిక రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో తల్లి మౌనిక రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నిరయ్యారు. బాలిక తల్లి మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై డి నర్సిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News