Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:52 PM

లారీ డ్రైవర్ అతివేగం.. బాలిక నిండు ప్రాణం బలి

లారీ డ్రైవర్ అతివేగం.. బాలిక నిండు ప్రాణం బలి

లారీ డ్రైవర్ అతివేగం.. బాలిక నిండు ప్రాణం బలి
February 15, 2026 02:29 AM 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లింగోజిగూడెం శివారులో హైవే 9 హోటల్ వద్ద శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త ఓ బాలిక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనతో మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఆరెగూడెం గ్రామానికి చెందిన వడ్డేగోని రమేష్ (33) తన పెద్ద కుమార్తె వడ్డెగోని రిహాన్సిక (9) తో కలిసి బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నారు.మార్గ మధ్యలో లింగోజిగూడెం హైవే 9 హోటల్ సమీపానికి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనతో బాలిక రిహాన్సిక లారీ వెనుక టైర్ల కింద పడిపోయింది. లారీ అదే వేగంతో ముందుకు దూసుకెల్లడంతో చిన్నారి తల ఛిద్రమై అక్కడీకక్కడే మృతి చెందింది. తండ్రి రమేష్ తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రమేష్ ను 108 అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె రిహాన్సిక రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో తల్లి మౌనిక రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నిరయ్యారు. బాలిక తల్లి మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై డి నర్సిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News