లక్ష్మాపూర్లో మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపిన
లక్ష్మాపూర్లో మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపిన
Sthanikam District Staff Reporter krishna
జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,బిఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:పెద్ద శంకరంపేట్ మండలం లక్ష్మాపూర్ గ్రామ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ సోదరుడు ఆకుల ప్రభాకర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు కొంత ఆర్థిక సహాయాన్ని అందించి మానవీయత చాటుకున్నారు. కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మచ్చేందర్తో పాటు ర్యాలమడుగు మాజీ ఎంపిటిసి అంర్య నాయక్, నమ్లిమేట్ మాజీ సర్పంచ్ సత్యపాల్ రెడ్డి, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుఱ్ఱపు జ్ఞానేశ్వర్, బసవరాజు పటేల్, మార్డి బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్ణం రాజు, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కార్తీక్, హన్మండ్లు, ప్రభాకర్, పుండరికం, బాలరాజు, రాజు, సంగమేశ్, యాదగిరి, బాలరాజు ప్రభాకర్, కృష్ణమూర్తి, హన్మంతు, గంగారాం, కిషన్, లక్ష్మియా, బేతయ్య, సాయిలు, వెంకట్, శ్రీను, రాజులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా మృతుని కుటుంబానికి అండగా ఉన్నామని, కష్టసమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి నిలుస్తారని నాయకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి