Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:30 PM

లక్ష్మీపురంలో బిఆర్ఎస్ జెండా ఎగిరింది

లక్ష్మీపురంలో బిఆర్ఎస్ జెండా ఎగిరింది

లక్ష్మీపురంలో బిఆర్ఎస్  జెండా ఎగిరింది
December 15, 2025 12:32 AM 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల రెండో విడతలో పులి పలుపుల సునీత–వీరస్వామి దంపతులు సంచలన విజయం సాధించారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన సునీత భారీ మెజార్టీతో గెలుపొందుతూ గ్రామ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపారు.

గత ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న సునీత ఈసారి ప్రజల నమ్మకాన్ని సంపాదించి ఘన విజయం సాధించడం విశేషం. ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి స్థాయిలో ప్రజాసేవే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమె నిర్ణయానికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రతి ఇంటికీ న్యాయం చేయాలనే స్పష్టమైన దృక్పథంతో ముందుకెళ్లిన సునీతకు మహిళలు, యువత పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఫలితంగా లక్ష్మీపురంలో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించగా, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఈ విజయం గ్రామంలో ప్రజాసేవకు పట్టం కట్టిన నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News