లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Biksham
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరిక
సామాజిక మాధ్యమాల్లో కొత్త మోసాల
నిర్వహించినా… ప్రోత్సహించినా కఠిన చర్యలు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బెట్టింగ్ యాప్లపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవడంతో ఆ దందాకు దాదాపు బ్రేక్ పడిందని, అయితే ఇప్పుడు కొందరు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని లక్కీ డ్రాల పేరుతో కొత్త రకమైన మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్లు, బైకులు, ఖరీదైన గ్యాడ్జెట్లు ఇస్తామని ప్రచారం చేస్తూ అమాయక ప్రజలను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ముఖ్య నగరాలు, పట్టణాల్లో లక్కీ డ్రాల పేరుతో మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయని పేర్కొన్నారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్రభావం కలిగిన వ్యక్తులు తమ అనుచరులను ఉపయోగించుకుని డ్రాలో పాల్గొంటే తప్పకుండా బహుమతి వస్తుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఇలాంటి డ్రాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, చివరికి ప్రజలు మోసపోయి బహుమతులు అందకుండా నష్టపోతున్నారని స్పష్టం చేశారు. లక్కీ డ్రాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, లాభాల ఆశ చూపించి ప్రజలను మోసం చేయడం నేరమని తెలిపారు. ఈ తరహా కార్యకలాపాలు ప్రైజ్ చిట్స్ మరియు మనీ సర్క్యులేషన్ పథకాల నిషేధ చట్టం కింద నేరంగా పరిగణించబడతాయని వెల్లడించారు. చట్టాన్ని అతిక్రమించి లక్కీ డ్రాలు నిర్వహించే వారిపై, వాటిని ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిపై, వాటిని ప్రచారం చేసిన ఎంతమందిపైనైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి