Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
January 19, 2026 08:39 AM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరిక

సామాజిక మాధ్యమాల్లో కొత్త మోసాల

నిర్వహించినా… ప్రోత్సహించినా కఠిన చర్యలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బెట్టింగ్ యాప్‌లపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవడంతో ఆ దందాకు దాదాపు బ్రేక్ పడిందని, అయితే ఇప్పుడు కొందరు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని లక్కీ డ్రాల పేరుతో కొత్త రకమైన మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్లు, బైకులు, ఖరీదైన గ్యాడ్జెట్లు ఇస్తామని ప్రచారం చేస్తూ అమాయక ప్రజలను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ముఖ్య నగరాలు, పట్టణాల్లో లక్కీ డ్రాల పేరుతో మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయని పేర్కొన్నారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్రభావం కలిగిన వ్యక్తులు తమ అనుచరులను ఉపయోగించుకుని డ్రాలో పాల్గొంటే తప్పకుండా బహుమతి వస్తుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఇలాంటి డ్రాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, చివరికి ప్రజలు మోసపోయి బహుమతులు అందకుండా నష్టపోతున్నారని స్పష్టం చేశారు. లక్కీ డ్రాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, లాభాల ఆశ చూపించి ప్రజలను మోసం చేయడం నేరమని తెలిపారు. ఈ తరహా కార్యకలాపాలు ప్రైజ్ చిట్స్ మరియు మనీ సర్క్యులేషన్ పథకాల నిషేధ చట్టం కింద నేరంగా పరిగణించబడతాయని వెల్లడించారు. చట్టాన్ని అతిక్రమించి లక్కీ డ్రాలు నిర్వహించే వారిపై, వాటిని ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిపై, వాటిని ప్రచారం చేసిన ఎంతమందిపైనైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News