Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:58 PM

లక్కారం రైతులకు ఊపిరి… లిఫ్ట్ స్కీమ్ పనులకు శ్రీకారం

లక్కారం రైతులకు ఊపిరి… లిఫ్ట్ స్కీమ్ పనులకు శ్రీకారం

లక్కారం రైతులకు ఊపిరి… లిఫ్ట్ స్కీమ్ పనులకు శ్రీకారం
March 12, 2026 04:39 PM 391 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దివిస్ పరిశ్రమ సి ఎస్ ఆర్ నిధులతో రూ.1.06 కోట్లు – పిల్లయపల్లి కాలువ నుంచి లోద్ది కుంట, గంగదేవి కుంటలకు నీరు

మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశానుసారం దివిస్ పరిశ్రమ వారి సౌజన్యంతో పిల్లయపల్లి కాలువ నుండి పైపులైన్ వేసి లిఫ్ట్ ద్వారా లోద్ది కుంట, గంగదేవి కుంటలను నీటితో నింపే పనులను కాలువ కమిటీ అధ్యక్షుడు,చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కాలువ సాధన కమిటీకి చెందిన రైతులు కలిసి మునుగోడు ఎమ్మెల్యేను కలవగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్థానిక దివిస్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వారి సి ఎస్ ఆర్ నిధుల ద్వారా లిఫ్ట్ స్కీమ్ మంజూరు చేయించారు. దీని వల్ల ఈ ప్రాంతంలో ఉన్న బీడు భూములు సాగుభూములుగా మారే అవకాశం కలిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.లిఫ్ట్ స్కీమ్ కోసం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్ కింద రూ.1 కోటి 6 లక్షల నిధులను మంజూరు చేసిన దివిస్ పరిశ్రమకు, రైతుల సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యేకు లక్కారం గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివిస్ పరిశ్రమ సి ఎస్ ఆర్ విభాగం ప్రతినిధి గోపి, 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బద్రిగాలయ్య, మాజీ ఎంపీటీసీ కాసార్ల శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొయ్యడ సైదులు గౌడ్, గ్రామ పెద్దలు దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి, గుండెబోయిన నర్సింహా యాదవ్, సూరకంటి మధుసూదన్ రెడ్డి, ఆకుల తిరుమల్ రెడ్డి, మునుకుంట్ల మల్లేశం గౌడ్, రాసాల ఐలయ్య, మునుకుంట్ల యాదయ్య గౌడ్, గంటిల యాదయ్య, తోటకూర రాములు యాదవ్, గోపనబోయిన పెద్దపెంటయ్య, తోటకూర జంగయ్య, సూరకంటి రాఘవ రెడ్డి, పాశం రాజేష్, ఆకుల యాదిరెడ్డి, రాసాల రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News