Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:08 AM

లీగల్ సర్వీసెస్ అధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ డే

లీగల్ సర్వీసెస్ అధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ డే

లీగల్ సర్వీసెస్ అధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ డే
December 12, 2025 08:26 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల, రామన్నపేట ఆసుపత్రులలో నిర్వహణ

హాజరైన ప్యానల్ అడ్వకెట్లు, డాక్టర్లు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా అదేశాలనుసారం, మండల న్యాయ సేవ అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో మండల పరిధిలోనీ మునిపంపులలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆశ్విన్ కుమార్, డాక్టర్ కల్యాణి ల సమక్షంలో లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, కోక సబిత లు కలిసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే -2025 సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అనంతరం అక్కడ న్యాయ సేవా అధికార సంస్థ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు డాక్టర్ దేవేందర్, డాక్టర్ మాధవ చారి ల సమక్షంలో ప్యానల్ లాయర్ మామిడి వెంకట్ రెడ్డి, గడ్డం నర్సింహ, వాలంటీర్ లు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, కోక సబిత లు హాజరై కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి, ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో ప్రజలకు చట్టపరమైన, ముఖ్యంగా మాతాశిశు ఆరోగ్యం, అత్యవసర సేవలు మరియు ఉచిత చికిత్స అందుబాటులో ఉన్న వ్యాధులకు సంబంధించిన హక్కులను తెలియజేసి, జాతీయ ఆరోగ్య పథకాల కింద ఉచిత చికిత్స గురుంచి తెలిపి న్యాయ సేవా అధికార సంస్థ పనులు, ఉపయోగం, వినియోగంలో తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు రెండు ఆసుపత్రులలో గల డాక్టర్లు, వైద్య సిబ్బంది, సిస్టర్స్, స్టాఫ్ నర్స్, శానిటేషన్ సిబ్బంది, వివిధ విభాగాల నుండి సిబ్బంది, ఒపి కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలు, జనరల్ వార్డులో ఉన్న పేషెట్లు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News