లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
Sthanikam District Staff Reporter
స్థానికం: యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్
భువనగిరి పట్టణ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు ఇందిరానగర్ లో బర్రె హేమలత,గంగారం శరత్ కుమార్ అనారోగ్యానికి గురై వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడం కోసం ఎక్కువ మొత్తంలో వైద్య ఖర్చులు పెట్టుకున్న వీరికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహాయ నిధి కోసం స్థానిక మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు గురువారం రోజు భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో స్థానిక భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్భంగా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...అనుకోకుండా ప్రమాదాల గురై మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకొని వైద్యం కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చులు చేసుకున్న వాళ్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా ఆర్థిక భరోసా కల్పించాలని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ పథకం పేద ప్రజల జీవితాలలో ఎంతో వెలుగును నింపుతుందని అన్నారు భువనగిరి నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంత మంది అప్లై చేసుకుంటే అంత మందికి మంజూరు చేయించడం జరిగిందని అన్నారు,పేద ప్రజలను ఆర్థికంగా నష్టపోకుండా వాళ్లను ఆర్థికంగా బలోపేతం చేయడం ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల వరకు పెంచి పేద ప్రజలకు నాణ్యతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్,బర్రె మహేందర్ కసరబోయిన సాయి,నరేందర్,గోపి,బాబు,నువ్వుల రాజు,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి