Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:34 PM

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి
January 04, 2026 11:45 AM 434 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మోత్కూర్ స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం గ్రామం సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. కాలేజీకి వెళ్లే క్రమంలో పల్సర్ బైక్‌పై భువనగిరి వైపు వెళ్తున్న ఇద్దరు యువకులను వలిగొండ ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసుల వివరాల ప్రకారం… ఈ ప్రమాదంలో మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన బోళ్ల దీక్షిత్ (తండ్రి: లేట్ బోళ్ల సంపత్) మరియు దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికుమార్ (తండ్రి: కుక్కల యాదగిరి) మృతిచెందారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఇద్దరూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఘటన విషయం తెలిసిన వెంటనే మృతుల బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇరు కుటుంబాల్లోనూ ఒక్కగానొక్క కొడుకులే కావడంతో వారి మృతి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడున్నవారి హృదయాలను కలచివేశాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.ఈ ప్రమాదం వలిగొండ ప్రధాన రహదారిపై వాహనాల వేగ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలపై మరోసారి గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిర్లక్ష్యం, అతివేగం యువ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయనే వాస్తవానికి ఇది మరో విషాదకర ఉదాహరణగా నిలిచింది.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News