Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 AM

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి
04-01-2026 444 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మోత్కూర్ స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం గ్రామం సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. కాలేజీకి వెళ్లే క్రమంలో పల్సర్ బైక్‌పై భువనగిరి వైపు వెళ్తున్న ఇద్దరు యువకులను వలిగొండ ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసుల వివరాల ప్రకారం… ఈ ప్రమాదంలో మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన బోళ్ల దీక్షిత్ (తండ్రి: లేట్ బోళ్ల సంపత్) మరియు దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికుమార్ (తండ్రి: కుక్కల యాదగిరి) మృతిచెందారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఇద్దరూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఘటన విషయం తెలిసిన వెంటనే మృతుల బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇరు కుటుంబాల్లోనూ ఒక్కగానొక్క కొడుకులే కావడంతో వారి మృతి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడున్నవారి హృదయాలను కలచివేశాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.ఈ ప్రమాదం వలిగొండ ప్రధాన రహదారిపై వాహనాల వేగ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలపై మరోసారి గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిర్లక్ష్యం, అతివేగం యువ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయనే వాస్తవానికి ఇది మరో విషాదకర ఉదాహరణగా నిలిచింది.





Sthanikam

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి

Article Image
మోత్కూర్ స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం గ్రామం సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. కాలేజీకి వెళ్లే క్రమంలో పల్సర్ బైక్‌పై భువనగిరి వైపు వెళ్తున్న ఇద్దరు యువకులను వలిగొండ ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసుల వివరాల ప్రకారం… ఈ ప్రమాదంలో మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన బోళ్ల దీక్షిత్ (తండ్రి: లేట్ బోళ్ల సంపత్) మరియు దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికుమార్ (తండ్రి: కుక్కల యాదగిరి) మృతిచెందారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఇద్దరూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఘటన విషయం తెలిసిన వెంటనే మృతుల బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇరు కుటుంబాల్లోనూ ఒక్కగానొక్క కొడుకులే కావడంతో వారి మృతి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడున్నవారి హృదయాలను కలచివేశాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.ఈ ప్రమాదం వలిగొండ ప్రధాన రహదారిపై వాహనాల వేగ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలపై మరోసారి గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిర్లక్ష్యం, అతివేగం యువ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయనే వాస్తవానికి ఇది మరో విషాదకర ఉదాహరణగా నిలిచింది.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News