Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:02 PM

కుష్ఠు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

కుష్ఠు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

కుష్ఠు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
February 10, 2026 09:23 AM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండల పరిధిలోని కొమ్మాయిగూడెం గ్రామపంచాయతీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సును హెచ్ఐవో గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా హెచ్ఐవో గోపాల్ మాట్లాడుతూ, కుష్ఠు వ్యాధి ప్రాణాంతకమైనది కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే శాశ్వత అంగవైకల్యానికి దారి తీసే వ్యాధి అని తెలిపారు. కుష్ఠు వ్యాధి కేసులు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తిస్థాయి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కుష్ఠు వ్యాధి లక్షణాలు, ఉచిత చికిత్స సౌకర్యాలు, మందుల వినియోగం, అంగవైకల్యం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు, ప్రజాప్రతినిధులకు వివరించారు.

అనంతరం కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగస్వాములుగా నిలవాలని విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో కొమ్మాయిగూడెం గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మురళీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏఎసీం సాదియా, ఆశ వర్కర్ కళావతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News