కుష్ఠు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
కుష్ఠు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
Editor Desk
మండల పరిధిలోని కొమ్మాయిగూడెం గ్రామపంచాయతీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సును హెచ్ఐవో గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా హెచ్ఐవో గోపాల్ మాట్లాడుతూ, కుష్ఠు వ్యాధి ప్రాణాంతకమైనది కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే శాశ్వత అంగవైకల్యానికి దారి తీసే వ్యాధి అని తెలిపారు. కుష్ఠు వ్యాధి కేసులు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తిస్థాయి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కుష్ఠు వ్యాధి లక్షణాలు, ఉచిత చికిత్స సౌకర్యాలు, మందుల వినియోగం, అంగవైకల్యం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు, ప్రజాప్రతినిధులకు వివరించారు.
అనంతరం కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగస్వాములుగా నిలవాలని విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కొమ్మాయిగూడెం గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మురళీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏఎసీం సాదియా, ఆశ వర్కర్ కళావతి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి