కుప్పిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
కుప్పిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
Biksham
బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కనుక రేణుకకు ఘన స్వాగతం
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుప్పిరెడ్డిగూడెం పదవ వార్డులో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కనుక రేణుక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఆ ఆకర్షణతోనే వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు.
కనుక రేణుక మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. కుప్పిరెడ్డిగూడెం వార్డు అభివృద్ధి కోసం, ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనుక రేణుకకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి