కుక్క కాటుతో మహిళకు గాయాలు
కుక్క కాటుతో మహిళకు గాయాలు
Biksham
వాకింగ్కు వెళ్లిన జయలక్ష్మిపై దాడి – ప్రజల్లో భయం
సూర్యాపేట పట్టణంలో కుక్కల కాటుతో రోజురోజుకు అధికమవుతోంది. ఉదయం వేళ వాకింగ్కు వెళ్లే ప్రజలు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం జయలక్ష్మి అనే మహిళ సూర్యాపేటలోని ఉన్నత యోగ శిక్షణ కేంద్రానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో అక్కడున్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఆరోగ్యం కోసం నడకకు వెళ్లే ప్రజలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, అక్కడికి వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కుక్కలు ఆందోళనకు గురై దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, కొత్త పాలకవర్గం వెంటనే చర్యలు తీసుకొని ప్రజల భద్రతను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి