కోతుల బెడదకు చెక్ సొంత నిధులతో రంగంలోకి దిగిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
కోతుల బెడదకు చెక్ సొంత నిధులతో రంగంలోకి దిగిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడదకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నడుం బిగించారు. గ్రామ ప్రజల కష్టాలు చూడలేక, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా సొంత నిధులతో కోతుల నివారణ చర్యలు చేపట్టారు.నిత్యం కోతుల కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతుండగా, పలువురు కోతుల దాడుల్లో గాయపడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోతులను బోన్లలో పట్టించి అటవీ ప్రాంతాలకు తరలిస్తూ, అక్కడ వాటికి సహజ జీవనం కలిగేలా విడిచిపెట్టే చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, కోతుల బెడద పూర్తిగా తగ్గే వరకు చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువతతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి