Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:59 AM

కోతుల బెడదకు చెక్ సొంత నిధులతో రంగంలోకి దిగిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

కోతుల బెడదకు చెక్ సొంత నిధులతో రంగంలోకి దిగిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

కోతుల బెడదకు చెక్ సొంత నిధులతో రంగంలోకి దిగిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
10-02-2026 201 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడదకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నడుం బిగించారు. గ్రామ ప్రజల కష్టాలు చూడలేక, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా సొంత నిధులతో కోతుల నివారణ చర్యలు చేపట్టారు.నిత్యం కోతుల కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతుండగా, పలువురు కోతుల దాడుల్లో గాయపడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోతులను బోన్లలో పట్టించి అటవీ ప్రాంతాలకు తరలిస్తూ, అక్కడ వాటికి సహజ జీవనం కలిగేలా విడిచిపెట్టే చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, కోతుల బెడద పూర్తిగా తగ్గే వరకు చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువతతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

కోతుల బెడదకు చెక్ సొంత నిధులతో రంగంలోకి దిగిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడదకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నడుం బిగించారు. గ్రామ ప్రజల కష్టాలు చూడలేక, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా సొంత నిధులతో కోతుల నివారణ చర్యలు చేపట్టారు.నిత్యం కోతుల కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతుండగా, పలువురు కోతుల దాడుల్లో గాయపడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోతులను బోన్లలో పట్టించి అటవీ ప్రాంతాలకు తరలిస్తూ, అక్కడ వాటికి సహజ జీవనం కలిగేలా విడిచిపెట్టే చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, కోతుల బెడద పూర్తిగా తగ్గే వరకు చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువతతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News