Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం

కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం

కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం
16-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ (బీ) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఫ్యాక్టరీని మహారాష్ట్రకు చెందిన ఓంకార్ సఖర్ కార్ఖానా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కొనుగోలు చేసి, మరమ్మతులు పూర్తి చేసి క్రషింగ్ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఇటీవల ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ట్రయల్ క్రషింగ్ చేశారు.1972–73లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో నిజాం షుగర్ పేరుతో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడింది. జహీరాబాద్–బీదర్ రహదారి పక్కన సుమారు 132 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఫ్యాక్టరీ రోజుకు 1250 టన్నుల చెరుకు క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసేది. తరువాత ప్రైవేటీకరణ అనంతరం క్రషింగ్ సామర్థ్యాన్ని 3500 టన్నులకు పెంచారు. అయితే యాజమాన్య మార్పులు, ఆర్థిక సమస్యల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్టరీ మూతపడింది.ఇటీవల ఓంకార్ సఖర్ కార్ఖానా యాజమాన్యం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని యంత్రాలకు మరమ్మతులు చేసి క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యాజమాన్యం, గ్రామ సర్పంచ్ ప్రతినిధులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫ్యాక్టరీ డైరెక్టర్ మాట్లాడుతూ ఇతర షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధర కంటే అధిక ధర రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూతపడ్డ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం కానుండడంతో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం

Article Image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ (బీ) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఫ్యాక్టరీని మహారాష్ట్రకు చెందిన ఓంకార్ సఖర్ కార్ఖానా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కొనుగోలు చేసి, మరమ్మతులు పూర్తి చేసి క్రషింగ్ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఇటీవల ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ట్రయల్ క్రషింగ్ చేశారు.1972–73లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో నిజాం షుగర్ పేరుతో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడింది. జహీరాబాద్–బీదర్ రహదారి పక్కన సుమారు 132 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఫ్యాక్టరీ రోజుకు 1250 టన్నుల చెరుకు క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసేది. తరువాత ప్రైవేటీకరణ అనంతరం క్రషింగ్ సామర్థ్యాన్ని 3500 టన్నులకు పెంచారు. అయితే యాజమాన్య మార్పులు, ఆర్థిక సమస్యల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్టరీ మూతపడింది.ఇటీవల ఓంకార్ సఖర్ కార్ఖానా యాజమాన్యం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని యంత్రాలకు మరమ్మతులు చేసి క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యాజమాన్యం, గ్రామ సర్పంచ్ ప్రతినిధులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫ్యాక్టరీ డైరెక్టర్ మాట్లాడుతూ ఇతర షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధర కంటే అధిక ధర రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూతపడ్డ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం కానుండడంతో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News