కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం
కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ (బీ) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఫ్యాక్టరీని మహారాష్ట్రకు చెందిన ఓంకార్ సఖర్ కార్ఖానా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కొనుగోలు చేసి, మరమ్మతులు పూర్తి చేసి క్రషింగ్ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఇటీవల ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ట్రయల్ క్రషింగ్ చేశారు.1972–73లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో నిజాం షుగర్ పేరుతో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడింది. జహీరాబాద్–బీదర్ రహదారి పక్కన సుమారు 132 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఫ్యాక్టరీ రోజుకు 1250 టన్నుల చెరుకు క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసేది. తరువాత ప్రైవేటీకరణ అనంతరం క్రషింగ్ సామర్థ్యాన్ని 3500 టన్నులకు పెంచారు. అయితే యాజమాన్య మార్పులు, ఆర్థిక సమస్యల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్టరీ మూతపడింది.ఇటీవల ఓంకార్ సఖర్ కార్ఖానా యాజమాన్యం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని యంత్రాలకు మరమ్మతులు చేసి క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యాజమాన్యం, గ్రామ సర్పంచ్ ప్రతినిధులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫ్యాక్టరీ డైరెక్టర్ మాట్లాడుతూ ఇతర షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధర కంటే అధిక ధర రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూతపడ్డ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం కానుండడంతో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి