Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం

కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం

కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం
March 16, 2026 06:22 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ (బీ) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఫ్యాక్టరీని మహారాష్ట్రకు చెందిన ఓంకార్ సఖర్ కార్ఖానా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కొనుగోలు చేసి, మరమ్మతులు పూర్తి చేసి క్రషింగ్ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఇటీవల ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ట్రయల్ క్రషింగ్ చేశారు.1972–73లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో నిజాం షుగర్ పేరుతో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడింది. జహీరాబాద్–బీదర్ రహదారి పక్కన సుమారు 132 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఫ్యాక్టరీ రోజుకు 1250 టన్నుల చెరుకు క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసేది. తరువాత ప్రైవేటీకరణ అనంతరం క్రషింగ్ సామర్థ్యాన్ని 3500 టన్నులకు పెంచారు. అయితే యాజమాన్య మార్పులు, ఆర్థిక సమస్యల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్టరీ మూతపడింది.ఇటీవల ఓంకార్ సఖర్ కార్ఖానా యాజమాన్యం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని యంత్రాలకు మరమ్మతులు చేసి క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యాజమాన్యం, గ్రామ సర్పంచ్ ప్రతినిధులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫ్యాక్టరీ డైరెక్టర్ మాట్లాడుతూ ఇతర షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధర కంటే అధిక ధర రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూతపడ్డ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం కానుండడంతో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News