Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:27 AM

కొత్తగూడెం గ్రామంలో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ ల ఆధ్వర్యంలో పల్లె - నిద్ర కార్యక్రమం

కొత్తగూడెం గ్రామంలో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ ల ఆధ్వర్యంలో పల్లె - నిద్ర కార్యక్రమం

కొత్తగూడెం గ్రామంలో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ  చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ ల ఆధ్వర్యంలో పల్లె - నిద్ర కార్యక్రమం
January 20, 2026 08:03 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) నూజివీడు రూరల్ సీఐ కె. రామ కృష్ణ, చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ ఇతర శాఖల అధికారు లతో కలిసి చాట్రాయి మండలం కొత్త గూడెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంను నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్థులతో ముఖా ముఖి సమావేశం నిర్వహించి, వారి భద్రత, సమస్యలు, నేర నివారణ విషయాలపై చర్చిం చారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. బ్యాంకు పేరుతో వస్తున్న ఫేక్ మెసేజ్లు, ఆధార్ అప్డేట్ మోసాలు, ఫేక్ లింక్‌లు క్లిక్ చేయడం వలన డేటా చోరీ. లాటరీ గెలిచినట్లు మెసేజ్‌ల ద్వారా OTP అడిగి డబ్బు మాయం చేసే మోసాల గురించి హెచ్చరించారు.ఇలాంటి సందర్భా ల్లో సైబర్ హెల్ప్‌లైన్ 1930 లేదా టోల్ ఫ్రీ నెంబర్ కు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆపద సమయం లో డయల్ 112 కు ఫోన్ చేస్తే 15–20 నిమిషాల్లో సహాయం అందించబడుతుందని, గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు తలెత్తిన సమయాలలో పోలీసు వారికి తెలియజేసిన యెడల సదరు సమస్యలను పరిష్కరించబడతాయని అది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిష్కార మార్గాలను పోలీసు వారు తీసుకుంటారని తెలియ జేశారు ప్రతి ఒక్కరూ సీసీటీవీ లను ఏర్పాటు చేసుకోవడం వలన నేర దర్యాప్తు సమయాలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, గ్రామాలలో కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సదరు వ్యక్తులు యొక్క వివరాలను సేకరించడం వలన దొంగతనాలు నివారించవచ్చని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల సమయంలో ఇది ప్రాణరక్షకంగా ఉంటుందని వివరించారు. మైనర్లు ద్విచక్ర వాహనాలను నడిపితే వారిపై జరిమానా విధించడమే కాకుండా వారికి 25 సంవత్సరా లు వయసు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా నియమ నిబంధనలు ఉన్నట్లు, సదరు మైనర్ల కుటుంబ పెద్ద పై కూడా కేసులను నమోదు చేస్తారని,గంజాయి, మత్తు పదార్థాలు, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని సూచించారు."పల్లె నిద్ర" కార్యక్రమం ప్రజలతో పోలీసులకు మానవీయ సత్సంబంధాలను పెంచడమే కాకుండా, భద్రతా పరిరక్షణ, చట్టాలపై అవగాహన, సామాజిక సమగ్రత అనే మూడు దిశల్లో సమగ్ర ప్రయోజనం అందించుట కొరకు ఇదే తరహా కార్యక్రమాలను నూజివీడు రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న మరిన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలియ జేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News