Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

కూసుమంచి మండలంలో విస్తృతంగా యూరియా పంపిణీ

కూసుమంచి మండలంలో విస్తృతంగా యూరియా పంపిణీ

కూసుమంచి మండలంలో విస్తృతంగా యూరియా పంపిణీ
February 13, 2026 06:23 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఒక్కరోజే 4,813 బస్తాల సరఫరా – రైతులు ముందస్తుగా నమోదు చేసుకోవాలి

కూసుమంచి: కూసుమంచి మండలంలోని జీళ్ల చెరువు, చేగొమ్మ సహకార సంఘ కేంద్రాలలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని డివిజన్ సహాయ సంచాలకులు సతీష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. సహకార సంఘ కేంద్రాలు మరియు ప్రైవేటు ఎరువుల దుకాణాల ద్వారా యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.శుక్రవారం ఒక్కరోజే 4,813 బస్తాల యూరియా నమోదిత విధానంలో రైతులకు అందించామని తెలిపారు. యూరియా అవసరమైన రైతులందరూ ఎరువుల నమోదు విధానం ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా ఏ కేంద్రంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయో ముందుగానే రైతులకు సమాచారం అందజేస్తున్నామని పేర్కొన్నారు.నమోదు చేసుకోవడం తెలియని రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎరువుల దుకాణాల సిబ్బంది, వాలంటీర్లు సహాయం అందిస్తారని తెలిపారు. అనంతరం జీళ్ల చెరువు గ్రామంలోని రైతులతో మాట్లాడిన ఆయన, ప్రతి రైతు తమ పంట వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు.ఇంకా నమోదు పూర్తి చేయని రైతులు వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, వ్యవసాయ విస్తరణ అధికారులు రవీందర్, రవి కుమార్, సహకార సంఘ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News