Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:22 PM

కూసుమంచి మండలంలో విస్తృతంగా యూరియా పంపిణీ

కూసుమంచి మండలంలో విస్తృతంగా యూరియా పంపిణీ

కూసుమంచి మండలంలో విస్తృతంగా యూరియా పంపిణీ
February 13, 2026 06:23 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఒక్కరోజే 4,813 బస్తాల సరఫరా – రైతులు ముందస్తుగా నమోదు చేసుకోవాలి

కూసుమంచి: కూసుమంచి మండలంలోని జీళ్ల చెరువు, చేగొమ్మ సహకార సంఘ కేంద్రాలలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని డివిజన్ సహాయ సంచాలకులు సతీష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. సహకార సంఘ కేంద్రాలు మరియు ప్రైవేటు ఎరువుల దుకాణాల ద్వారా యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.శుక్రవారం ఒక్కరోజే 4,813 బస్తాల యూరియా నమోదిత విధానంలో రైతులకు అందించామని తెలిపారు. యూరియా అవసరమైన రైతులందరూ ఎరువుల నమోదు విధానం ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా ఏ కేంద్రంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయో ముందుగానే రైతులకు సమాచారం అందజేస్తున్నామని పేర్కొన్నారు.నమోదు చేసుకోవడం తెలియని రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎరువుల దుకాణాల సిబ్బంది, వాలంటీర్లు సహాయం అందిస్తారని తెలిపారు. అనంతరం జీళ్ల చెరువు గ్రామంలోని రైతులతో మాట్లాడిన ఆయన, ప్రతి రైతు తమ పంట వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు.ఇంకా నమోదు పూర్తి చేయని రైతులు వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, వ్యవసాయ విస్తరణ అధికారులు రవీందర్, రవి కుమార్, సహకార సంఘ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News