Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

కూలీ నుంచి గ్రూప్–2 వరకూ… విజయలక్ష్మి స్ఫూర్తిదాయక విజయ గాథ

కూలీ నుంచి గ్రూప్–2 వరకూ… విజయలక్ష్మి స్ఫూర్తిదాయక విజయ గాథ

కూలీ నుంచి గ్రూప్–2 వరకూ… విజయలక్ష్మి స్ఫూర్తిదాయక విజయ గాథ
January 31, 2026 07:33 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నంద్యాల జిల్లా: కష్టాలు ఎంత పెద్దవైనా, పట్టుదల ఉంటే విజయాన్ని ఆపలేవని మరోసారి నిరూపించింది రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామానికి చెందిన విజయలక్ష్మి. రోజంతా కూలీ పనులు చేసి, రాత్రిళ్లు చదువుకుంటూ చివరకు గ్రూప్–2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) గా ఎంపికై అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది.పేద కుటుంబంలో జన్మించిన విజయలక్ష్మికి చిన్ననాటి నుంచే జీవితం పోరాటమే. కుటుంబ అవసరాల కోసం కూలీ పనులు చేయాల్సి వచ్చేది. అయితే చదువు ద్వారా జీవితాన్ని మార్చుకోవాలనే లక్ష్యాన్ని ఆమె ఎప్పుడూ వదల్లేదు. రోజంతా శ్రమించి అలసిపోయినా, రాత్రివేళల్లో పుస్తకాలే ఆమెకు తోడయ్యాయి.ఇంతలో కుటుంబానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె భర్త ప్రమాదానికి గురి కావడంతో ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి. కుటుంబ బాధ్యతలన్నీ విజయలక్ష్మి భుజాలపై పడ్డాయి. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఆశలు వదిలేసే సమయంలో, ఆమె మాత్రం మరింత ధైర్యంగా నిలబడి ముందుకు సాగింది.కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకు సమయం కేటాయిస్తూ, ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని నిరంతర సాధన చేసింది. అనేక ఆటంకాలు ఎదురైనా, చివరకు ఆమె కృషికి ఫలితం దక్కి గ్రూప్–2లో ASOగా ఎంపికయ్యారు.విజయలక్ష్మి విజయం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. కూలీ పనుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం వరకూ వచ్చిన ఆమె ప్రయాణం గ్రామీణ యువతకు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు గొప్ప స్ఫూర్తిగా మారింది.పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి.కానీ మన పట్టుదలే మన విజయాన్ని నిర్ణయిస్తుంది” అని విజయలక్ష్మి ప్రయాణం స్పష్టంగా చెబుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News