కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు
కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు
Vaddeman Suresh
వలిగొండ స్థానికం ప్రతినిధి:
వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నేత,బిఆర్ఎస్ పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొనపురి సాంబశివుడు,కొనపురి
రాములు మాతృమూర్తి కొనపురి లక్ష్మమ్మ,ఆదివారం మృతి చెందడంతో సోమవారం ఆమె మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఉద్యమ నాయకులు చెరుకు సుధాకర్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డిలు హాజరై ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అంతిమయాత్ర పూర్తయ్యేంత వరకు వేముల పుష్ప,సుక్క రామనర్సయ్య ఆధ్వర్యంలో కళాకారులు ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో క్రాంతి దళ్ అధ్యక్షుడు పృద్వి,మొగుళ్ళ శ్రీనివాస్ సంగిశెట్టి క్రిస్టఫర్,పడమటి దామోదర్ రెడ్డి,తుమ్మల వెంకటరెడ్డి,కొమురెల్లి సంజీవరెడ్డి,అయోధ్య, కోనపురి కవిత,స్వర్ణలత,నారి మల్లేష్,నారీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి