Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:43 PM

కొలువుదీరిన పురపాలక పాలకులు

కొలువుదీరిన పురపాలక పాలకులు

కొలువుదీరిన పురపాలక పాలకులు
February 16, 2026 05:30 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన మేయర్‌లు, చైర్మన్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు నూతనంగా ఎన్నికైన మేయర్‌లు, చైర్మన్లు, ఉప మేయర్‌లు, ఉప చైర్మన్లు, సభ సభ్యులు, విభాగ సభ్యులకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఈ నూతన ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం నగరపాలక సంస్థ తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మూడ్ గణేష్ , ఉప మేయర్‌గా ఎన్నికైన సిరిపురపు లలిత కి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన పురపాలక సంఘాల చైర్మన్లు, ఉప చైర్మన్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

మధిర పురపాలక సంఘ చైర్మన్ సామినేని సుజాత, ఉప చైర్మన్ కోట ధనమూర్తి , సత్తుపల్లి చైర్మన్ రెహానా బేగం, ఉప చైర్మన్ బొంతు సుమలత, వైరా చైర్మన్ కాపా చంద్రకళ , ఉప చైర్మన్ కట్ల సంతోష్ , అశ్వారావుపేట చైర్మన్ జూపల్లి శశికళ , ఉప చైర్మన్ జూపల్లి రమేష్, ఏదులాపురం చైర్మన్ పోకబత్తిని అనిత, ఉప చైర్మన్ తమ్మినేని నవీన్, కల్లూరు పురపాలక సంఘ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, ఉప చైర్మన్ శీలం కోటేశ్వరి కు మంత్రి అభినందనలు తెలిపారు. పట్టణాల్లోని ప్రతి వార్డు, ప్రతి విభాగం అభివృద్ధి చెందాలంటే సభ సభ్యులంతా సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News