Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 09:43 PM

కొలనుపాక గ్రామ పంచాయతీ కార్యాలయాన్నీఅదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కొలనుపాక గ్రామ పంచాయతీ కార్యాలయాన్నీఅదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కొలనుపాక గ్రామ పంచాయతీ కార్యాలయాన్నీఅదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
March 16, 2026 08:18 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మార్చి 31లోపు ఇంటి పన్ను100శాతం వసూలు చేయాలని అధికారులకు ఆదేశం.

ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ,రికార్డుల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు.సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలకు సమయానికి సేవలు అందేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇంటి పన్ను వసూలు అత్యంత ముఖ్యమని తెలిపారు.గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మార్చి 31వ తేదీ లోపు 100 శాతం పన్ను వసూలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గడువులోపు పన్ను వసూలు పూర్తికాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అభివృద్ధి పనులు సమర్థవంతంగా కొనసాగాలంటే ఆదాయ వనరులు పెరగడం అవసరమని పేర్కొన్నారు.అనంతరం గ్రామ నర్సరీలను సందర్శించాలని అధికారులకు సూచించారు.గ్రామాల్లో మొక్కల పెంపకం మరియు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఇక ప్రతి రోజు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.భోజనం రుచికరంగా,పరిశుభ్రంగా ఉందో లేదో పరిశీలించి పిల్లలకు పోషకాహారంతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.విద్యార్థుల ఆరోగ్యం మరియు విద్యాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్ రెడ్డి,సర్పంచ్ యాకమ్మ,ఉప సర్పంచ్ విజయేందర్ రెడ్డి,సంబంధిత శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News