కోహిర్ మున్సిపల్ ఎన్నికల వార్డు 04లో ఇంటింటి ప్రచారం విస్తృతంగా
కోహిర్ మున్సిపల్ ఎన్నికల వార్డు 04లో ఇంటింటి ప్రచారం విస్తృతంగా
Krishna
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోహిర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కోహిర్ పట్టణంలోని వార్డు నెం. 04లో ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలిసి, మున్సిపల్ ఎన్నికల ప్రాధాన్యతను వివరించడంతో పాటు తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.ప్రచారంలో భాగంగా నాలుగోవ వార్డు పరిధిలోని సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటూ,వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.తాగునీరు, డ్రైనేజీ, రహదారులు,పారిశుధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నాయకులు తెలిపారు.ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని,రాబోయే ఎన్నికల్లో వార్డు అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని స్థానికులు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అభ్యర్థి అశోక్ ,ఉమర్ అహ్మద్ సాహెబ్,వార్డు ఇన్చార్జ్ గురుజువాడ గ్రామం సర్పంచ్ రాజేందర్, మొహమ్మద్ ముదస్సిర్ అహ్మద్,దిగ్వాల్ జీపీ వార్డు మెంబర్ నాయకులు స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి