PRINT TIME: March 29, 2026 10:58 PM
కోగిరలో గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఉషశ్రీ చరణ్
కోగిరలో గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఉషశ్రీ చరణ్
March 29, 2026 08:31 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని కోగిర గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవం గ్రామ ప్రజలు కనుల పండుగగా ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పలు మండలాల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి