Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:37 PM

కొండాపురం గ్రామంలో సిపిఐ ఇంటింటి ప్రచారం - భూనాది కాలువ పూర్తి చేయాలని డిమాండ్

కొండాపురం గ్రామంలో సిపిఐ ఇంటింటి ప్రచారం - భూనాది కాలువ పూర్తి చేయాలని డిమాండ్

కొండాపురం గ్రామంలో సిపిఐ ఇంటింటి ప్రచారం - భూనాది కాలువ పూర్తి చేయాలని డిమాండ్
April 08, 2026 08:24 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సిపిఐ మండల కమిటీ

మోటకొండూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ,ప్రజాస్వామ్య అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,కొండాపురం నుండి ఆత్మకూరు వరకు ఉన్న భూనాది కాలువ పనులను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కాలువ పూర్తయితే సుమారు1000 ఎకరాల భూమికి సాగునీరు అంది రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు పశువుల నరసింహ,మంచాల రాధమ్మ,మంచాల పద్మ,ఎండి.పాషా,మంచాల మాధవి,సంచారం మల్లారెడ్డి,మంచాల సుగుణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News