PRINT TIME: April 08, 2026 10:56 PM
కొండాపురం గ్రామంలో సిపిఐ ఇంటింటి ప్రచారం - భూనాది కాలువ పూర్తి చేయాలని డిమాండ్
కొండాపురం గ్రామంలో సిపిఐ ఇంటింటి ప్రచారం - భూనాది కాలువ పూర్తి చేయాలని డిమాండ్
April 08, 2026 08:24 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
- సిపిఐ మండల కమిటీ
మోటకొండూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ,ప్రజాస్వామ్య అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,కొండాపురం నుండి ఆత్మకూరు వరకు ఉన్న భూనాది కాలువ పనులను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కాలువ పూర్తయితే సుమారు1000 ఎకరాల భూమికి సాగునీరు అంది రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు పశువుల నరసింహ,మంచాల రాధమ్మ,మంచాల పద్మ,ఎండి.పాషా,మంచాల మాధవి,సంచారం మల్లారెడ్డి,మంచాల సుగుణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి