Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 04:03 AM

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి
May 15, 2026 07:52 PM 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి దుకాణాలకు బహిరంగ టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 10 దుకాణాల ద్వారా సంవత్సరానికి కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే దేవస్థానానికి ఆదాయం వస్తోందని కమిటీ సభ్యులు తెలిపారు. అదే టెండర్ల ద్వారా కేటాయిస్తే రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈనెల 31తో దుకాణాల గడువు ముగియనున్న నేపథ్యంలో వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టాలని కోరారు.

కొండకింద అన్నదానం కాంప్లెక్స్ వద్ద ఉన్న 112 షాపింగ్ కాంప్లెక్స్‌లకు కూడా టెండర్లు నిర్వహిస్తే దేవస్థానానికి ఆదాయం పెరగడంతో పాటు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కొందరే ఏళ్ల తరబడి దుకాణాలను కొనసాగించడం వల్ల దేవస్థాన ఆదాయానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు.

దేవస్థాన అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు కోసం పారదర్శక టెండర్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, బండ రామస్వామి, దండబోయిన వీరేష్, బండి వాసు, కర్రె ప్రవీణ్, బండి అనిల్, కొన్నె సంజీవ, గుండ్లపల్లి లింగం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News