కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్
కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్
Editor Desk
యాదాద్రి:
కొండపై వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుకాణాలకు వెంటనే టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దేవస్థానం ఈవోకు కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కొత్త టెండర్లు నిర్వహించకుండా కొందరు రాజకీయ పలుకుబడితో వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తక్కువ కిరాయిలతో దుకాణాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో కొత్తవారికి అవకాశాలు లేకుండా పోతున్నాయని తెలిపారు.
ఏళ్ల తరబడి రెన్యువల్ లేకుండానే కొందరు దుకాణాలు కొనసాగిస్తున్నారని, వారి ప్రభావంతో టెండర్ల ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శించారు. స్థానిక నిరుద్యోగులు ఉపాధి కోసం తక్కువ జీతాలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
దుకాణాల నిర్వహణ వల్ల దేవస్థానానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా, భక్తులను అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని కోరారు.
మే 31లోపు షాపులను వేలం వేయకపోతే జూన్ 1 నుంచి స్థానిక నిరుద్యోగులతో కలిసి కొండపైకి వెళ్లి కొబ్బరికాయలు, పూలు, పండ్లు, వస్త్రాలు విక్రయిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సుడుగు జీవన్రెడ్డి, కాటబత్తిని ఆంజనేయులు, దేవపూజ అశోక్, గుండు నరసింహ, మిరియాల కృష్ణ, సతీష్ బట్టు, వంగపల్లి అరుణ్, బండి అనిల్, మందోజు నరేష్, కర్రె ప్రవీణ్, గుండు కుమార్, ఆరె కుమార్, కొనే ప్రశాంత్, గోపగాని ప్రసాద్, కర్రె శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి