Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
14 వ వార్డు గణేష్ నగర్‌లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:27 PM

కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్

కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్

కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్
May 07, 2026 07:04 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి:

కొండపై వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుకాణాలకు వెంటనే టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దేవస్థానం ఈవోకు కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కొత్త టెండర్లు నిర్వహించకుండా కొందరు రాజకీయ పలుకుబడితో వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తక్కువ కిరాయిలతో దుకాణాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో కొత్తవారికి అవకాశాలు లేకుండా పోతున్నాయని తెలిపారు.

ఏళ్ల తరబడి రెన్యువల్ లేకుండానే కొందరు దుకాణాలు కొనసాగిస్తున్నారని, వారి ప్రభావంతో టెండర్ల ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శించారు. స్థానిక నిరుద్యోగులు ఉపాధి కోసం తక్కువ జీతాలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

దుకాణాల నిర్వహణ వల్ల దేవస్థానానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా, భక్తులను అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని కోరారు.

మే 31లోపు షాపులను వేలం వేయకపోతే జూన్ 1 నుంచి స్థానిక నిరుద్యోగులతో కలిసి కొండపైకి వెళ్లి కొబ్బరికాయలు, పూలు, పండ్లు, వస్త్రాలు విక్రయిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సుడుగు జీవన్‌రెడ్డి, కాటబత్తిని ఆంజనేయులు, దేవపూజ అశోక్, గుండు నరసింహ, మిరియాల కృష్ణ, సతీష్ బట్టు, వంగపల్లి అరుణ్, బండి అనిల్, మందోజు నరేష్, కర్రె ప్రవీణ్, గుండు కుమార్, ఆరె కుమార్, కొనే ప్రశాంత్, గోపగాని ప్రసాద్, కర్రె శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News