Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 08:11 PM

కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్

కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్

కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్
May 07, 2026 07:04 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి:

కొండపై వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుకాణాలకు వెంటనే టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దేవస్థానం ఈవోకు కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కొత్త టెండర్లు నిర్వహించకుండా కొందరు రాజకీయ పలుకుబడితో వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తక్కువ కిరాయిలతో దుకాణాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో కొత్తవారికి అవకాశాలు లేకుండా పోతున్నాయని తెలిపారు.

ఏళ్ల తరబడి రెన్యువల్ లేకుండానే కొందరు దుకాణాలు కొనసాగిస్తున్నారని, వారి ప్రభావంతో టెండర్ల ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శించారు. స్థానిక నిరుద్యోగులు ఉపాధి కోసం తక్కువ జీతాలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

దుకాణాల నిర్వహణ వల్ల దేవస్థానానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా, భక్తులను అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని కోరారు.

మే 31లోపు షాపులను వేలం వేయకపోతే జూన్ 1 నుంచి స్థానిక నిరుద్యోగులతో కలిసి కొండపైకి వెళ్లి కొబ్బరికాయలు, పూలు, పండ్లు, వస్త్రాలు విక్రయిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సుడుగు జీవన్‌రెడ్డి, కాటబత్తిని ఆంజనేయులు, దేవపూజ అశోక్, గుండు నరసింహ, మిరియాల కృష్ణ, సతీష్ బట్టు, వంగపల్లి అరుణ్, బండి అనిల్, మందోజు నరేష్, కర్రె ప్రవీణ్, గుండు కుమార్, ఆరె కుమార్, కొనే ప్రశాంత్, గోపగాని ప్రసాద్, కర్రె శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News