Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:14 AM

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు
12-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు, పారాయణాలు

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హనుమాన్‌ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొండపై పుష్కరిణి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు.

ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, పురోహితులు అభిషేకం, ప్రత్యేక అలంకారం, హనుమాన్‌ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, వేదపఠనం నిర్వహించారు. అలాగే లక్ష తమలపాకు అర్చన, మహామంగళహారతి చేపట్టారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీశంకర్‌, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఉప ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, ఆదిత్యాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

Article Image

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు, పారాయణాలు

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హనుమాన్‌ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొండపై పుష్కరిణి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు.

ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, పురోహితులు అభిషేకం, ప్రత్యేక అలంకారం, హనుమాన్‌ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, వేదపఠనం నిర్వహించారు. అలాగే లక్ష తమలపాకు అర్చన, మహామంగళహారతి చేపట్టారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీశంకర్‌, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఉప ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, ఆదిత్యాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News