Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 10:09 PM

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు
May 12, 2026 08:21 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు, పారాయణాలు

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హనుమాన్‌ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొండపై పుష్కరిణి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు.

ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, పురోహితులు అభిషేకం, ప్రత్యేక అలంకారం, హనుమాన్‌ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, వేదపఠనం నిర్వహించారు. అలాగే లక్ష తమలపాకు అర్చన, మహామంగళహారతి చేపట్టారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీశంకర్‌, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఉప ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, ఆదిత్యాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News