కొండపై ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
కొండపై ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
Editor Desk
యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు, పారాయణాలు
యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొండపై పుష్కరిణి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు.
ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, పురోహితులు అభిషేకం, ప్రత్యేక అలంకారం, హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, వేదపఠనం నిర్వహించారు. అలాగే లక్ష తమలపాకు అర్చన, మహామంగళహారతి చేపట్టారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఉప ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, ఆదిత్యాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి