కోదాడలో వెస్టేజ్ స్టోర్ ప్రారంభం.
కోదాడలో వెస్టేజ్ స్టోర్ ప్రారంభం.
Harish HS
నాణ్యమైన ఉత్పత్తులతోనే ఆరోగ్యం......
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి........
ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు కోదాడ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కోమరబండ వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వెస్టేజ్ స్టోర్ ను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్టోర్లోని వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, నిత్యవసరాలు ఒకే చోట లభించడం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.పట్టణ ప్రజలకు నాణ్యమైన మరియు హెల్త్ కేర్ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ స్టోర్ ఏర్పాటు చేశామని, గుండె ఆరోగ్యానికి తోడ్పడే కొలెస్ట్రాల్ రహిత వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ఆడెపు కృష్ణవేణి, మల్లికార్జున్ ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే, డిఎస్పి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి లను శాలువా పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆడెపు కృష్ణవేణి, మల్లికార్జున్, ఆడెపు సైదులు టీం సభ్యులు ,రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, పేర బోయినగోపి, పిడమర్తి గాంధీ, మామిడి గోపి,పూర్ణ, శ్రీనివాసరావు, మామిడి వెంకటేశ్వర్లు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు........
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి