Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

కోదాడలో వెస్టేజ్ స్టోర్‌ ప్రారంభం.

కోదాడలో వెస్టేజ్ స్టోర్‌ ప్రారంభం.

కోదాడలో వెస్టేజ్ స్టోర్‌ ప్రారంభం.
March 09, 2026 05:44 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

నాణ్యమైన ఉత్పత్తులతోనే ఆరోగ్యం......

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి........

ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు కోదాడ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కోమరబండ వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వెస్టేజ్ స్టోర్‌ ను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్టోర్‌లోని వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, నిత్యవసరాలు ఒకే చోట లభించడం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.పట్టణ ప్రజలకు నాణ్యమైన మరియు హెల్త్ కేర్ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ స్టోర్ ఏర్పాటు చేశామని, గుండె ఆరోగ్యానికి తోడ్పడే కొలెస్ట్రాల్ రహిత వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ఆడెపు కృష్ణవేణి, మల్లికార్జున్ ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే, డిఎస్పి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి లను శాలువా పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆడెపు కృష్ణవేణి, మల్లికార్జున్, ఆడెపు సైదులు టీం సభ్యులు ,రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, పేర బోయినగోపి, పిడమర్తి గాంధీ, మామిడి గోపి,పూర్ణ, శ్రీనివాసరావు, మామిడి వెంకటేశ్వర్లు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News