Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:38 AM

కోదాడలో వెస్టేజ్ స్టోర్‌ ప్రారంభం.

కోదాడలో వెస్టేజ్ స్టోర్‌ ప్రారంభం.

కోదాడలో వెస్టేజ్ స్టోర్‌ ప్రారంభం.
09-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నాణ్యమైన ఉత్పత్తులతోనే ఆరోగ్యం......

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి........

ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు కోదాడ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కోమరబండ వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వెస్టేజ్ స్టోర్‌ ను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్టోర్‌లోని వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, నిత్యవసరాలు ఒకే చోట లభించడం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.పట్టణ ప్రజలకు నాణ్యమైన మరియు హెల్త్ కేర్ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ స్టోర్ ఏర్పాటు చేశామని, గుండె ఆరోగ్యానికి తోడ్పడే కొలెస్ట్రాల్ రహిత వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ఆడెపు కృష్ణవేణి, మల్లికార్జున్ ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే, డిఎస్పి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి లను శాలువా పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆడెపు కృష్ణవేణి, మల్లికార్జున్, ఆడెపు సైదులు టీం సభ్యులు ,రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, పేర బోయినగోపి, పిడమర్తి గాంధీ, మామిడి గోపి,పూర్ణ, శ్రీనివాసరావు, మామిడి వెంకటేశ్వర్లు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు........

Sthanikam

కోదాడలో వెస్టేజ్ స్టోర్‌ ప్రారంభం.

Article Image

నాణ్యమైన ఉత్పత్తులతోనే ఆరోగ్యం......

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి........

ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు కోదాడ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కోమరబండ వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వెస్టేజ్ స్టోర్‌ ను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్టోర్‌లోని వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, నిత్యవసరాలు ఒకే చోట లభించడం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.పట్టణ ప్రజలకు నాణ్యమైన మరియు హెల్త్ కేర్ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ స్టోర్ ఏర్పాటు చేశామని, గుండె ఆరోగ్యానికి తోడ్పడే కొలెస్ట్రాల్ రహిత వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ఆడెపు కృష్ణవేణి, మల్లికార్జున్ ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే, డిఎస్పి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి లను శాలువా పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆడెపు కృష్ణవేణి, మల్లికార్జున్, ఆడెపు సైదులు టీం సభ్యులు ,రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, పేర బోయినగోపి, పిడమర్తి గాంధీ, మామిడి గోపి,పూర్ణ, శ్రీనివాసరావు, మామిడి వెంకటేశ్వర్లు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News