Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
February 06, 2026 04:56 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగాపురం ఐదో వార్డు కు చెందిన సీనియర్ నాయకులు మల్లు బిక్షమా రెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్ రెడ్డి తో పాటు 10 కుటుంబాలు, వంద మంది కార్యకర్తలు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంకటరత్నం బాబు మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో వలసలు మొదలయ్యాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో జరిగింది.బిక్షమా రెడ్డి సీనియర్ నాయకుడు కావడంతో పాటు విస్తృత వ్యాపార పరిచయాలు కలిగిన వ్యక్తి కావడం వల్ల స్థానిక 5వ, 6వ వార్డుల్లో మంచి ప్రభావం కలిగి ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడే గుణం ఉన్న నాయకుడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో 5వ, 6వ వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బొలిశెట్టి రాము, తుమ్మల నాగేంద్రమ్మ కన్నయ్య, అలాగే సీనియర్ నాయకులు వనపర్తి రామయ్య, బెక్కం వెంకటేశ్వర్లు, బొలిశెట్టి వెంకట్ నారాయణ, తుమ్మల గోపయ్య, తుమ్మల బాబు, నల్లాని కొండయ్య, చీకటి శ్రీను, మల్లు కుటుంబ సబ్యులు తదితరులు అధిక సంక్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News