కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
Harish HS
కోదాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగాపురం ఐదో వార్డు కు చెందిన సీనియర్ నాయకులు మల్లు బిక్షమా రెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్ రెడ్డి తో పాటు 10 కుటుంబాలు, వంద మంది కార్యకర్తలు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంకటరత్నం బాబు మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో వలసలు మొదలయ్యాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో జరిగింది.బిక్షమా రెడ్డి సీనియర్ నాయకుడు కావడంతో పాటు విస్తృత వ్యాపార పరిచయాలు కలిగిన వ్యక్తి కావడం వల్ల స్థానిక 5వ, 6వ వార్డుల్లో మంచి ప్రభావం కలిగి ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడే గుణం ఉన్న నాయకుడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో 5వ, 6వ వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బొలిశెట్టి రాము, తుమ్మల నాగేంద్రమ్మ కన్నయ్య, అలాగే సీనియర్ నాయకులు వనపర్తి రామయ్య, బెక్కం వెంకటేశ్వర్లు, బొలిశెట్టి వెంకట్ నారాయణ, తుమ్మల గోపయ్య, తుమ్మల బాబు, నల్లాని కొండయ్య, చీకటి శ్రీను, మల్లు కుటుంబ సబ్యులు తదితరులు అధిక సంక్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి