Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:29 PM

కోదాడలో ఘోరం: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

కోదాడలో ఘోరం: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

కోదాడలో ఘోరం: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!
May 07, 2026 04:57 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ బస్టాండ్ ముందు మహిళ హత్య...

బార్య శిరీషను కత్తితో పొడిచి చంపిన భర్త మణిదీప్....

అందరూ చూస్తుండగానే ఘటన....

కోదాడ పట్టణంలో బుధవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ సమీపంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఘటన వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శిరీష, మణిదీప్ దంపతులు బుధవారం కోదాడకు వచ్చారు. బస్టాండ్ ముందు మాట్లాడుకుంటున్న క్రమంలో ఇద్దరి మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన మణిదీప్, తన వద్ద ఉన్న కత్తితో భార్య శిరీషపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడ, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ప్రజలు రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నిందితుడు దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న కొందరు సాహసించి అతడిని పట్టుకున్నట్లు సమాచారం.కుటుంబ కలహాలే కారణమా కాపురంలో తలెత్తిన గొడవలు, కుటుంబ కలహాల నేపథ్యమే ఈ హత్యకు దారి తీసిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News