Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం பதவியேற்கும் முன்பே விஜய் அதிரடி தீர்மானம்! డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 06:06 AM

కోదాడలో ఘోరం: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

కోదాడలో ఘోరం: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

కోదాడలో ఘోరం: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!
May 07, 2026 04:57 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ బస్టాండ్ ముందు మహిళ హత్య...

బార్య శిరీషను కత్తితో పొడిచి చంపిన భర్త మణిదీప్....

అందరూ చూస్తుండగానే ఘటన....

కోదాడ పట్టణంలో బుధవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ సమీపంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఘటన వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శిరీష, మణిదీప్ దంపతులు బుధవారం కోదాడకు వచ్చారు. బస్టాండ్ ముందు మాట్లాడుకుంటున్న క్రమంలో ఇద్దరి మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన మణిదీప్, తన వద్ద ఉన్న కత్తితో భార్య శిరీషపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడ, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ప్రజలు రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నిందితుడు దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న కొందరు సాహసించి అతడిని పట్టుకున్నట్లు సమాచారం.కుటుంబ కలహాలే కారణమా కాపురంలో తలెత్తిన గొడవలు, కుటుంబ కలహాల నేపథ్యమే ఈ హత్యకు దారి తీసిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News