Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ
March 17, 2026 04:53 PM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

*ఫిర్యాదులు, కేసులు పెడింగ్ ఉంచకుండా పని చేయాలి.*

- *ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక.*

- *రంజాన్, ఉగాది పండుగ సందర్బంగా ప్రజలు ఉత్సవాలు కలిసిమెలిసి జరుపుకోవాలి.*

సూర్యాపేట జిల్లాలోని పోలీస్ స్టేషన్లో తనిఖీలు భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనకి చేసినారు. తనకి లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నందు నిర్వహిస్తున్న రికార్డ్స్,ఫిర్యాదుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, కమ్యూనిటీ కార్యక్రమాలు, సీసీ కెమెరాల నిర్వహణ ను పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా రికార్డ్ నిర్వహణ, పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం ట్రాఫిక్ పునరుద్ధరణ అంశాల గురించి పట్టణ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు సలహాలు సూచనలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల ఫిర్యాదులపై వేగంగా స్పందించి వారికి భరోసా కల్పించాలని కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు వేగంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పని చేయాలని అన్నారు. ప్రజా చైతన్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రత పట్ల, సైబర్ మోసాల పట్ల, సామాజిక భద్రత పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. కోదాడ పట్టణంలో ట్రాఫిక్ నిర్వహణ అవతరణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రజలకు వాహనదారులకు సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సంబంధిత మున్సిపాలిటీ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాపార నిర్వహకులు రోడ్లపై వస్తువులు పెట్టి అమ్మకూడదని రోడ్లను ఆక్రమించడం వల్ల వచ్చి పోయే వాహనాలకు సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. రంజాన్ దసరా పర్వదినాలు ఒకేసారి వస్తున్నందున ప్రజలు ఒకరికొకరు సోదరా భావంతో ఉంటూ మతాలకతీతంగా ఉత్సవాలను కలిసి మెలిసి జరుపుకోవాలని కోరారు. ప్రజల భద్రతలో పోలీస్ శాఖ అనునిత్యం కృషి చేస్తుంది అన్నారు.ఎస్పీ వెంట కోదాడ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐ లు సుదీర్, చిన్న మాల్సూర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజి రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News