Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:16 PM

కోదాడ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి

కోదాడ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి

కోదాడ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి
February 02, 2026 02:49 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి

రికార్డు మెజారిటీ తో 31వ వార్డు కౌన్సిలర్ కుసుమ బాబు ను గెలిపించాలీ....

మంత్రి ఉత్తమ్ సహాకారం తో కోదాడ ను అభివృద్ధి లో అగ్ర స్థానంలో నిలుపుతా.....

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.

కోదాడ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలనీ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమ వారం కోదాడ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు లో మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ వెంకట్ రత్నం బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. జరగబోయే 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించాలన్నారు. కార్యకర్తలు పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు.స్థానిక 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ను రికార్డు మెజార్టీ తో గెలిపించాలన్నారు.పార్టీ అభ్యర్ధుల గెలుపు కు కృషి చేసే వారందరికీ తప్పక గుర్తిస్తాం అన్నారు. మంత్రి ఉత్తమ్ గాని, తాను కానీ పార్టీ గెలుపు కోసం కృషి చేసే ప్రతి నాయకుడిని, కార్యకర్త ను అన్యాయం చేయం అన్నారు.

పరస్పర సహాకారం...... సమన్వయం తో పని చేయాలనీ సూచించారు.

మంత్రి ఉత్తమ్ సహాకారం తో కోదాడ ను అభివృద్ధి లో అగ్ర స్థానంలో నిలుపుతా అన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చా అన్నారు.కోదాడ మున్సిపాలిటీ 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మంత్రి ఉత్తమ్ కు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రత్యర్ధులు ప్రలోభాలకు గానీ మోస పూరిత, అసత్య ప్రచారాలు తిప్పి కొట్టాలన్నారు. 31వ వార్డు లో పరిపాలన అనుభవం, కష్ట పడే మనస్తత్వం ఉన్న ఎర్నేని వెంకట్ రత్నం బాబు సతీమణి కుసుమ బాబు ను గెలిపించాలన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు వార్డు లోని నాయకుల ను కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని ప్రతి ఓటర్ కలిసి ఓటు అభ్యర్థించాలన్నారు.ప్రతి ఓటు విలువైనదే అన్నారు. ఎన్నికల పోటీలో నిర్లక్ష్యం వహించ వద్దన్నారు. ఎన్నికల ప్రచారం లో ప్రతిఒక్కరు దూసుక వెళ్లాలన్నారు. మాజీ సర్పంచ్ యెర్నేని వెంకట్ రత్నం బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు, పట్టణ నాయకులు, స్థానిక వార్డు నాయకులు, కార్య కర్తలు ప్రముకులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News