కోదాడ లాకప్ డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
కోదాడ లాకప్ డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
మేజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు
డీజీపీ, కలెక్టర్, ఎస్పీకి నోటీసులు
కోదాడ, జనవరి:
సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై మేజిస్టీరియల్ విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ తెలంగాణ డీజీపీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.
గత ఏడాది నవంబర్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన కర్ల రాజేష్ను కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేక రాజేష్ మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఢిల్లీ యూనివర్సిటీ లా స్టూడెంట్, రంగారెడ్డి జిల్లాకు చెందిన సభావత్ కళ్యాణ్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఎనిమిది వారాల్లో పూర్తి చర్యల నివేదికతో పాటు మేజిస్టీరియల్ విచారణ నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి