కంచనపల్లి గ్రామం లో ఓటర్ల ప్రతిజ్ఞ.
కంచనపల్లి గ్రామం లో ఓటర్ల ప్రతిజ్ఞ.
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
కంచనపల్లి గ్రామం లో ఓటర్ల ప్రతిజ్ఞ.
నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్ సీనియర్ జర్నలిస్ట్
కాంచనపల్లి గ్రామంలో ఎన్జి ప్రభుత్వ కళాశాల (స్వ ), నల్గొండ ఎన్ఎస్ఎస్ యూనిట్-IV ఆధ్వర్యములో ప్రారంభమైన శీతకలా ప్రత్యేక శిబిరంలో బాగంగా శుక్రవారం రోజూన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కంచనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు 16 వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలలో బాగాంగా ఓటర్ల ప్రతిజ్ఞ చేయటం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరీ, పంచాయతీ కార్యదర్శి M స్వరూప , వార్డు మెంబెర్స్,M. పద్మ ICDS supervisor Gr-I గారు, ఎన్ ఎస్ ఎస్ యూనిట్-IV ప్రోగ్రామ్ ఆఫీసర్ మంద సావిత్రి, వాలంటీర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ప్రతిజ్ఞ అనంతరం సావిత్రి ఓటు హక్కు ప్రాధాన్యత ను తెలియచేయటం జరిగింది. మరియు ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడారు.తదనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో (బాల్య వివాహ నిషేధ చట్టం-2006) బాల్య వివాహాలను నిర్ములించాలని ప్రతిజ్ఞ చేయటం జరిగింది. అలాగే బాల్య వివాహ విముక్త రథం ప్రచారం లో బాగాంగా బాల్య వివాహాలకి వ్యతిరేకంగా స్లోగన్స్ (స్టాప్ స్టాప్- చైల్డ్ చైల్డ్ మ్యారేజెస్, బాల్యం పిల్లల హక్కు) చేస్తూ ర్యాలీ చేయటం జరిగింది..ఈ కార్యక్రమం లో M శోభా రాణి Asritha Dist కోఆర్డినేటర్, N. Revathi DCPU-Counsellor ,P. ధనమ్మ Asritha NGO social worker, వాలంటీర్స్ మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ M. సావిత్రి పాల్గొన్నారు.మధ్యాహ్నం భోజనం అనంతరం వ్యక్తిత్వ వికాసం పైన మాట్లాడేందుకు గాను Dr గంజి భాగ్యలక్ష్మి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువలాజి ని ముఖ్య అతిధి గా ఆహ్వానించటం జరిగింది.ఆడపిల్లలు మనోధైర్యాన్ని పెంపోదించుకోవాలని, ప్రతి చిన్నవిషయాలకు ఆందోళనకు గురి కాకుండా తమ జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మాట్లాడారు.ఈ ప్రోగ్రామ్ లో జానయ్య మాథ్స్ టీచర్, PO సావిత్రి, వాలంటీర్స్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి