PRINT TIME: April 01, 2026 11:08 PM
కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర
కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర
April 01, 2026 08:45 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
కంగ్టి గ్రామంలో వెలసిన సిద్ధేశ్వరుని జాతర అంటే అది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకం, ఒక పెద్ద పండుగ. ఈ వేడుకను వీక్షించేందుకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తుల నామస్మరణతో కంగ్టి పురవీధులు మారుమోగుతున్నాయి.
ముఖ్యంగా, ఈ గ్రామానికి చెందిన ఆడపడుచులు తమ ఇంటి దేవుడైన సిద్ధేశ్వరుని దర్శించుకోవడానికి మెట్టినింటి నుండి కంగ్టికి చేరుకోవడంతో ఊరంతా కొత్త కళను సంతరించుకుంది. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన శిఖరం ఎక్కించే కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు."
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి